కొరటికల్లో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం
మహబూబ్నగర్: ఉప్పునూతల మండలం కొరటికల్లో ఓ యువకుడు 5 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మహిళలు, బాలికలపై అత్యాచారాలను నియంత్రించడానికి కొత్త చట్టాలను రూపొందించుతున్నా ఫలితం ఉండటంలేదు. కఠిన శిక్షలు విధిస్తున్నా, నిర్భయ వంటి చట్టం చేసినా ఇటువంటి అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి.