ప్రత్యేక హోదాకు మద్దతు: రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.
పోలవరం ప్రాజెక్టుతోపాటు విభజన చట్టంలోని ఇతర హామీల అమలు కోసం తమ పార్టీ మద్దతు ఇస్తుందని, ఏపీకి న్యాయం జరిగే వరకు అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.