11న ఆమదాలవలసలో బహిరంగ సభ
ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి
11న ఆమదాలవలసలో బహిరంగ సభ
శ్రీకాకుళం ,ఆమదాలవలస: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్ప యాత్రకు జిల్లాలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి అ న్నారు. స్థానిక టీఎస్సార్ కళాశాల ఆవరణలో శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్ర స న్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సును అనునిత్యం ఆ కాంక్షించిన ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన ఒక అడుగు ముందుకేస్తే ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి పదడుగులు ముందుకేస్తున్నారని అన్నారు. ఈ నెల 11వ తేదీన ఆమదాలవలస పట్టణంలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేసి నియోజకవర్గ సత్తా చూపాలని పిలుపునిచ్చారు. నవరత్నాలను గ్రామ స్థాయిలో ప్రచారం చేయాల్సిన బాధ్యత బూత్ కమిటీలదేనని స్పష్టం చేశారు.