11న ఆమదాలవలసలో బహిరంగ సభ

Public Meeting in Amudala Valasa Srikakulam - Sakshi

ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి  

11న ఆమదాలవలసలో బహిరంగ సభ

శ్రీకాకుళం ,ఆమదాలవలస: వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్ప యాత్రకు జిల్లాలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అ న్నారు. స్థానిక టీఎస్సార్‌ కళాశాల ఆవరణలో శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్ర స న్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సును అనునిత్యం ఆ కాంక్షించిన ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన ఒక అడుగు ముందుకేస్తే ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి పదడుగులు ముందుకేస్తున్నారని అన్నారు. ఈ నెల 11వ తేదీన ఆమదాలవలస పట్టణంలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేసి నియోజకవర్గ సత్తా చూపాలని పిలుపునిచ్చారు. నవరత్నాలను గ్రామ స్థాయిలో ప్రచారం చేయాల్సిన బాధ్యత బూత్‌ కమిటీలదేనని స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top