మా మనవడు బంగారం..
ఆత్మకూరు: ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి భారీగా స్పందన లభించింది. అందరికంటే ఎక్కువగా పండుటాకులు, వృద్ధులు సైతం తమ మనవడు ఎప్పుడు వస్తాడా అంటూ ఎదురు చూడడం విశేషం. ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మాకు రూ.200 పింఛన్ మంజూరు అయ్యింది. ఇప్పుడు ఆయన కొడుకు జగన్ మా కోసం జిల్లాలోనే ఎంతో మారుమూల గ్రామమైన మా ఊరు మీదుగా నడుచుకుంటూ వస్తున్నాడు.
మనవడిని టీవీలో చూశామే తప్ప ఎదురుగా చూడలేదు. ఈరోజు ఎలాగైనా చూడాలని వచ్చాం’ అని ఆదివారం మధ్యాహ్నం వైఎస్ జగన్ను కలిసిన అనంతరం ఎర్రగుడి సమీపంలో సుబ్బమ్మ, ఎల్లమ్మ, వెంకటమ్మ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు. ‘ఎంతో ఆప్యాయంగా అవ్వా బాగున్నారా అంటూ మా మనవడు అడిగాడు. పింఛన్ మీ నాన్న ఇచ్చాడని సంబరంగా చెప్పుకొన్నాం. మన ప్రభుత్వం వస్తే పింఛన్ రూ.2 వేలు చేస్తానని చెప్పాడు. జగన్ గెలుస్తాడు మాకు పింఛన్ వస్తుంది’ అంటూ ఆ వృద్ధులు ఆనందం వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తలు