విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం :జి.సిగడాం మండలంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులు బస్సు సౌకర్యం లేక నిత్యం అవస్థలు పడుతున్నారు. 16 కిలోమీటర్లు దూరంలో ఉన్న పొందూరు మండల కేంద్రంలో కళాశాల చదువుల కోసం నిత్యం వేదన పడుతున్నారు. రోడ్లున్నా ఆర్టీసీ సేవలందడం లేదు. పొందూరులో హాస్టల్ వసతి కల్పిస్తే విద్యార్థులు చదువుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు స్కాలర్షిప్పులు ప్రభుత్వం సక్రమంగా ఇవ్వడం లేదు. – పొన్నాడ సంధ్యారాణి, శ్రీరామాజూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, వాండ్రంగి.