16న ప్రధాని మోదీ రాక

Prime Minister Narendra Modi Tour Next Month in Visakhapatnam - Sakshi

విశాఖసిటీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన ఖరారైంది. పార్టీ కార్యక్రమాలతో పాటు వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఫిబ్రవరి 16వ తేదీన మోదీ విశాఖలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు వస్తున్న నేపథ్యంలో వచ్చే నెల 16న జిల్లాకు రానున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తెలిపారు. వచ్చే నెల 4న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విజయనగరంలో పర్యటించనున్నారనీ, ఆ తర్వాత ప్రధాని మోదీతో పాటు అమిత్‌ షా కూడా విశాఖ రానున్నారని వెల్లడించారు. తొలిసారిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు విశాఖలో పర్యటించనున్నారని విష్ణుకుమార్‌రాజు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top