ఐదోరోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
ప్రారంభం ఉ. 9 గంటలకు ఎర్రగుంట్ల శివారు
ముగింపు రా. 9 గంటలకు ప్రొద్దుటూరు బైపాస్
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మున్సిపాలిటీ శివారు మైలవరం కాలువ సమీపంలోని బస నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. పొట్లదుర్తి మీదుగా ప్రొద్దుటూరు శివారులోని హౌసింగ్బోర్డు వరకు పాదయాత్ర చేస్తారు. ఈ మేరకు పాదయాత్ర ఐదోరోజు షెడ్యూలును పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం శుక్రవారం మీడియాకు విడుదల చేశారు.
ఉదయం 9 గంటలకు పాదయాత్ర ప్రారంభం
► ఉదయం 11 గంటలకు పొట్లదుర్తి
► మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రొద్దుటూరు శివారు అయ్యప్పగుడి దగ్గర భోజన విరామం
► మధ్యాహ్నం 3.00 గంటలకు పాదయాత్ర ప్రారంభం
► సాయంత్రం 5 గంటలకు ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్లో బహిరంగసభ
► రాత్రి 9 గంటలకు ప్రొద్దుటూరు బైపాస్లోని
► సాయిశ్రీ వెంచర్(హౌసింగ్ బోర్డు) సమీపంలో రాత్రి బస