ప్రజాసంకల్పయాత్రను జయప్రదం చేయండి
విజయనగరం, జియ్యమ్మవలస: వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్రను జయప్రదం చేయాలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. పెదమేరంగి కూడలిలో విలేకరులతో ఆమె శుక్రవారం మాట్లాడారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం ఉల్లిభద్రలో అడుగుపెడతారని, కార్యకర్తలంతా హాజరై జయప్రదం చేయాలని కోరారు. కురుపాం మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించే బహిరంగ సభను నియోజకవర్గంలోని నాయకులు, బూత్కమిటీ సభ్యులు అధికసంఖ్యలో హాజరై పాదయాత్రను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కోరారు.