చారిత్రకం.. ప్రజాసంకల్పయాత్ర విజయ స్థూపం
వైఎస్సార్సీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శితలశిల రఘురాం
శ్రీకాకుళం ,ఇచ్ఛాపురం రూరల్ : ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ముగింపు కేంద్రం వద్ద నిర్మిస్తున్న విజయ స్థూపం చరిత్రాత్మకంగా నిలిచిపోనుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజా సంకల్పయాత్ర టూర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం అన్నారు. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి సమీపంలో ధనరాజ తులసమ్మ గుడి సమీపంలో నిర్మిస్తున్న ప్రజాసంకల్పయాత్ర విజయస్థూపం (పైలాన్) నిర్మాణ పనులను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర ప్రవేశించే సమయం జనవరి తొలివారానికల్లా నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు పనులు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు వైఎస్ జగన్ మేనల్లుడు అర్జునరెడ్డి, చంద్రారెడ్డి, పైలాన్ నిర్మాణకర్త కాయల వెంకటరెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు మల్లిడి సత్తిరెడ్డి, తాడి ఆదిరెడ్డి, బాలాజీ చౌదరి ఉన్నారు.