విద్యుత్ ఉద్యోగుల్లో వెలుగులు నింపాలన్నా..
తూర్పుగోదావరి : విద్యుత్ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న మాకు కనీస వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలున్నా ప్రభుత్వం అమలు చేయడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కాకినాడలో ఆయనకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో సుమారు 23 వేల మందికిపైగా పనిచేస్తున్నారన్నారు.
గతంలో ఖాళీగా ఉన్న సుమారు ఏడువేల జేఎల్ఎం పోస్టుల నియామకంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కాంట్రాక్టు లేబర్కు అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేయడం లేదన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
సంబంధిత వార్తలు