సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌

PM Narendra Modi Talk With CM YS Jagan On Coronavirus - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణకు సంబంధించి ప్రధాని మోదీ ఆదివారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఇందులో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రధాని ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీకి వివరించారు. వారిద్దరి మధ్య కరోనాతోపాటు ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top