రాష్ట్రాల బీజేపీ నేతలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

PM Modi Video Conference with State BJP leaders - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రాల వారీగా భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, కీలక నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాష్ట్ర బీజేపీ ఎంపీలు హరిబాబు,  గోకరాజు గంగరాజు, శాసనసభాపక్షనేత విష్ణుకుమార్‌రాజు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ మాధవ్‌లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమై.. గంటన్నర వ్యవధిలో ఈ కార్యక్రమం ముగిసింది. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ నేతలకు మాట్లాడే అవకాశం దక్కలేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top