వైఎస్ లేకే ఇక్కట్లు
విజయనగరం : వైఎస్ హయాంలో వైద్య సహాయం చక్కగా అందేది.. ఆ మహానుభావుడు మరణించాక కష్టాలు ఎక్కువయ్యాయన్నా.. అని గరివిడి పట్టణానికి చెందిన తండేల శ్రీనివాసరావు, తన భార్య రాజేశ్వరితో కలిసి జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు గుండె జబ్బు ఉందని.. నెలంతా కలిపి రూ.500 మాత్రమే మందులకు ఖర్చయితే.. ఇప్పుడేమో నెలకు కనీసం రూ.3,500 అవుతోందని వివరించాడు. అప్పటి మాదిరిగానే మందులు కూడా ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఇప్పించాలని కోరాడు.