పది జిల్లాలకు మించి విశాఖలో విజయం
సాక్షి, విశాఖపట్నం:వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఇప్పటివరకు జరిగిన పది జిల్లాలకు మించి విశాఖలో జరుగుతోంది. ఇప్పటి వరకు 2,900 కిలోమీటర్ల పైన పాదయాత్ర పూర్తి చేసుకుంది. నాలుగున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారు. 2018 నాటికి పూర్తి చేస్తామన్న పోలవరం గాని, ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ ఏదీ సాధించలేకపోయారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు ఇక నెగ్గలేనని తెలిసి కేసీఆర్లా ముందస్తు ఎన్నికలకు వెళ్లలేకపోతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలతో పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకుని వెళ్తాం. – తైనాల విజయకుమార్, వైఎస్సార్ సీపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు