మాకోసం..నీవు రావాలన్నా..!

People Support To Ys Jagan In Praja sankalpa yatra - Sakshi

పశ్చిమగోదావరి :ఈ టీడీపీ ప్రభుత్వం వాళ్లు నాకు పింఛన్‌ ఇవ్వలేదు.. నా కష్టం తీరాలంటే..జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలి.. అని శ్రీరాములు కోరిక.. రాజన్న పాలనలో సంతోషంగా జీవించాం.. ఆ రోజులు మళ్లీ రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని భీమడోలుకు చెందిన భూలోకం ఆకాంక్ష.. ఇలా ప్రజాసంకల్పపాదయాత్రలో సాగుతోన్న జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

నువ్వు వస్తేనే మా బతుకుల్లో వెలుగు
జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో భీమడోలుకు చెందిన మామిడి భూలోకం తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ టీడీపీ ప్రభుత్వంలో రోజూ దినదినగండంగా బతుకుతున్నామని, నాడు మీ తండ్రి గారు వైఎస్సార్‌ ప్రభుత్వంలో సంతోషంగా ఉండేవాళ్లమని చెప్పారు. నువ్వు సీఎంగా వస్తేనే మా బతుకుల్లో వెలుగులు వస్తాయని జగన్‌తో అన్నారు.

జగన్‌ సీఎం కావాలన్నదే నా కోరిక
నాకు 65 ఏళ్లు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పింఛన్‌ మంజూరు చేసిన వారు లేరు. పింఛన్‌ రాకపోయినా ఫర్వాలేదు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడమే నా కోరిక. నేను మరణించే లోపు జగన్‌ను సీఎంగా చూడాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నా అంటూ ఐఎస్‌ రామానుజపురానికి చెందిన గొల్లపల్లి శ్రీరాములు అనే వ్యక్తి ప్రజాసంకల్పయాత్రలో పాల్గొని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top