మేమంతా జగనన్న ఫ్యాన్స్
పశ్చిమగోదావరి :ఆమె పేరు నాగేశ్వరమ్మ.. ఆరోగ్యం సరిగా లేదు.. అయినా రెండు రోజులు ఎదురుచూసి వైఎస్సార్ సీపీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని ప్రజాసంకల్పయాత్రలో కలసింది. ఆయన ఆశీర్వాదం పొందింది. గుడివాడకు చెందిన అజీమ్ దివ్యాంగుడు.. అయినా ఓపిక తెచ్చుకుని తమ అభిమాన నేత వెంట పాదయాత్రలో పాల్గొంటున్నాడు. చివరి వరకూ జగన్ వెంటే అంటూ చెప్పాడు. ఇలా ఎందరో జగనన్నకు ‘ఫ్యాన్స్’.. జిల్లాలో జరుగుతోన్న ప్రజాసంకల్పయాత్రలో గురువారం ఆయన్ని కలసి ఎంతో ఆనందాన్ని పొందారు.
జగనన్నను కలిస్తే చాలనుకున్నాం
జగనన్నను కలిస్తే చాలు. ఓ పూట కూలిపని పోయినా ఫరవాలేదు అన్నారు మెట్ట పంగిడిగూడెం మహిళలు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గురువారం ద్వారకా తిరుమల మండలంలోని మెట్ట పంగిడిగూడెంలో గోపాలపురం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా అక్కడి మహిళలు పనుల్లోకి వెళ్లకుండా జగన్ రాక కోసం ఎదురుచూశారు.