ఎన్ని కష్టాలయ్యా సామీ..
‘అయ్యో.. సామి ఎన్ని కష్టాలయ్యా నీకు’ అంటూ జగన్ చూడగానే ధర్మవరం నియోజకవర్గం తుమ్మల గ్రామానికి చెందిన వృద్ధురాలు లక్ష్మమ్మ కన్నీళ్లు పెట్టారు. రాజులా బతకాల్సిన నువ్వు ఇలా అయిపోయావేంటయ్యా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం జాగ్రత్త సామి అంటూ దీవెనలు అందించారు. తనదైన శైలిలో ఆమెను జగన్ ఓదార్చారు.