పింఛన్ తొలగించారు
దివ్యాంగుడినైనా తనకు పింఛన్ మంజూరు చేయకుండా తిప్పుకుంటున్నారంటూ జగన్ ఎదుట బత్తలపల్లి మండలం అప్రాచెరువు గ్రామానికి చెందిన వెంకట్రాముడు వాపోయాడు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ను ఆయన కలిసి సమస్య వివరించారు. తనకు 66 శాతం వైకల్యమున్నట్లు అధికారులు మంజూరు చేసిన ధ్రువీకరణ పత్రాన్ని చూపారు. 20 సంవత్సరాలుగా తీసుకుంటున్న పింఛన్ను టీడీపీ అధికారంలోకి రాగానే తొలగించారని కన్నీటి పర్యాంతమయ్యాడు.