‘ఉపాధి’ని అనుసంధానిస్తే రైతులకు ఊరట
ఉపాధి పనులు వ్యవసాయానికి అనుసంధానం అయ్యేలా కృషి చేయాలని తన లాంటి పేద రైతులను ఆదుకోవాలని అనంతపురం రూరల్ మండలం ప్రసన్నాయపల్లికి చెందిన ద్వారకనాథరెడ్డి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. గురువారం ఆయన ప్రజా సంకల్ప యాత్రలో జగన్ను కలిశారు. తాను 6 ఎకరాల పొలంలో కూరగాయలు పండిస్తున్నానని, కూలీలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. ఉపాధి పనులను అనుసంధానం చేస్తే ఇటు రైతులకు, అటు కూలీలకు ఇద్దరికీ లాభదాయకంగా ఉంటుందన్నారు.