మూడు చక్రాల సైకిల్ కోసం..
వికలాంగురాలైన తనకు మూడు చక్రాల సైకిల్ మంజూరు చేయాలంటూ అధికారుల చుట్టూ తిరిగి వేసారి పోయానని జగన్ ఎదుట కందుకూరుకు చెందిన మిద్దె సాలమ్మ వాపోయారు. గురువారం కందుకూరులో జగన్ను ఆమె కలిసి తన సమస్యను వివరించారు. ఎలాగైనా తనకు మూడు చక్రాల సైకిల్ ఇప్పించాలని వేడుకున్నారు.
పక్షవాతంతో రెండు కాళ్లు చచ్చు పడిపోయినా.. మొక్కవోని ఆత్మస్థైర్యంతో రోడ్డుపైకి చేరుకుని తన కోసం ఎదురు చూస్తూ కూర్చొన్న కందుకూరు వాసి బోయ అక్కమ్మను పరామర్శిస్తున్న జగన్. మూడేళ్లుగా తనకు పింఛన్ అందకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారంటూ ఈ సందర్భంగా జగన్ ఎదుట ఆమె కన్నీటి పర్యంతమైంది.