సీపీఎస్ రద్దుకు ఒత్తిడి తీసుకురండి
ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం కల్గించే సీపీఎస్ను రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకెళ్లాలని జగన్ను ఏపీ వైఎస్సార్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి.వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం కందుకూరులో జగన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అధికారంలోకి రాగానే సీపీఎస్ను రద్దు చేస్తామని ప్రకటించడం హర్షణీయమని అన్నారు. ఆయన వెంట పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు.
‘ది లీడర్’ అందజేత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నవరత్నాలను విశ్లేషిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ఐటీ విభాగం కార్యదర్శి భూమిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి రచించిన ‘ ది లీడర్’ పుస్తకాన్ని గురువారం ప్రజా సంకల్పయాత్రలో గంగలకుంట వద్ద ఆయన వైఎస్ జగన్కు అందజేశారు. పార్టీ ప్రకటించిన నవరత్నాల హామీలు, పార్టీ అంతర్గత నిర్మాణం, బలోపేతానికి విలువైన సలహాలతో పుస్తకాన్ని రూపొందించినట్లు ఈ సందర్భంగా జగన్కు ఆయన వివరించారు.