కాళ్లు పడిపోయినా పింఛన్ ఇవ్వలేదయ్యా..
రాప్తాడు: ‘పక్షవాతంతో రెండు కాళ్లు చచ్చు పడిపోయాయి. మూడేళ్లుగా మంచానికే పరిమితమయ్యా. పింఛన్ మంజూరు చేస్తే కొద్దో గొప్పో కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. దయలేని ఈ ప్రభుత్వం మాపై కనికరం చూపడం లేద’ంటూ కందుకూరుకు చెందిన బోయ అక్కమ్మ జగన్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. పింఛన్ అందకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని, ఎలాగైనా పింఛన్ మంజూరు చేయించాలని కోరారు.