బాగా బుద్ధి చెప్పారయ్యా...

People Sharing There Sorrows To Ys Jagan - Sakshi

కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటున్న చంద్రబాబునాయుడు తమలాంటి పేదల గురించి మాత్రం పట్టించుకోవడం లేదని, రుణాలు మాఫీ అవుతాయని ఆశపడి ఓట్లేసినందుకు తమకు బాగా బుద్ధి చెప్పారని డ్వాక్రా సంఘాల మహిళలు వైఎస్‌ జగన్‌ వద్ద వాపోయారు. నారాయణపురం, తపోవనం కాలనీలకు చెందిన డ్వాక్రా మహిళలు గువ్వల అంజనాదేవి, తులసమ్మ, సాజిదాబేగం, రత్నమ్మ తదితరులు రుద్రంపేట బైపాస్‌ సమీపంలో పాదయాత్రగా వస్తున్న జగన్‌ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ రుణాలు మాఫీ కాలేదని, వడ్డీలు కట్టాలని బ్యాంకర్లు నోటీసులు పంపుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top