శస్త్ర చికిత్స చేయించుకోవాలి
తూర్పుగోదావరి : శస్త్ర చికిత్స చేయించుకోవడానికి ఆర్థిక స్థోమతలేదని, ఆదుకోవాలన్నా అని కాట్రేనిపాడుకు చెందిన పాల ప్రసాద్వర్మ జగన్ను కోరాడు. 2012లో రోడ్డు ప్రమాదం జరగడంతో కాలికి శస్త్ర చికిత్స చేసి రాడ్లు వేశారని అతను తెలిపాడు. ఆ రాడ్లను తీయడానికి తిరిగి శస్త్ర చికిత్స చేయాలని, దానికి రూ. 50 వేల వరకు ఖర్చవుతుందని తెలిపాడు. రోజూవారి కూలీగా పని చేసే తనకు అంత స్థోమత లేదని, ఆదుకోవాలని కోరాడు.
సంబంధిత వార్తలు