మంజూరైనా పింఛను ఇవ్వడం లేదు
తూర్పుగోదావరి : వికలాంగురాలినైన తనకు పింఛను మంజూరైనప్పటికీ ఇవ్వడం లేదని జగ్గన్నపేటకు చెందిన కడలి లక్ష్మీదుర్గ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. నాలుగేళ్లుగా ఒక్క రూపాయి కూడా పింఛనుగా ఇవ్వలేదని తెలిపింది. దీనిపై అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరైంది. ఈ విషయాన్ని కలెక్టర్కు చెప్పినా స్పందించలేదని, తనకు పింఛను వచ్చేలా చూడాలని జగన్ను కోరింది.
సంబంధిత వార్తలు