మా సమస్యలను జగన్ ప్రస్తావించారు
వాకపల్లి వీరాస్వామి, బి.దొడ్డవరం, మామిడికుదురు మండలం
గోదావరి వరదల సమయంలో తీర గ్రామాల్లోనివారు పడుతున్న ఇబ్బందులను జగన్ ప్రస్తావించడం ఎంతో ఆనందం కలిగించింది. ఒక మాదిరి వరదకే కాజ్వేలు ముంపు బారినపడడంతో రోడ్డుమార్గం లేక ప్రమాదం అంచున పడవలపై ప్రయాణం సాగిస్తున్నాం. కాజ్వేల ఎత్తు పెంచి ముంపు సమస్య నుంచి విముక్తి కలిగిస్తామని పాలకులు ఎన్నోసార్లు హామీ ఇచ్చారు. ఏదీ అమలు కాలేదు. జగన్ మా పక్షాన మాట్లాడడాన్ని మేము స్వాగతిస్తున్నాం.