ఆదుకో అన్నా..
కోన అనిత, ములుగుపల్లి
తన కుమార్తె గుండెకు శస్త్ర చికిత్స చేయించాలని.. ఆదుకో అన్నా అని ములుగుపల్లికి చెందిన కోన అనిత జగన్ను కోరింది. ప్రజాసంకల్పయాత్రలో ఆమె తన నాలుగేళ్ల కుమార్తె క్రిషితతో కలిసి జగన్ను కలుసుకుని సమస్యను వివరించింది. క్రిషితకు ఆరు నెలల వయస్సులో గుండెకు రంధ్రం ఉందని తెలిసిందని, శస్త్ర చికిత్సకు రూ. 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని ఆమె తెలిపింది. కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే తమకు ఇది చాలా భారమని.. ఆదుకోవాలని ఆమె కోరింది.