తాగునీటి సదుపాయం కల్పించడం లేదు
తూర్పుగోదావరి : పేరుకు మెయిన్ రోడ్డు పక్కనే నివాసం ఉంటున్నా కనీసం తాగునీటిని కూడా అందించడంలేదంటూ కాపుల కల్యాణ మండపం సమీపంలోని నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు రూ.50 కుళాయి పన్నును కట్టించుకుంటున్నారని, కానీ నీటి సదుపాయం కల్పించడం లేదంటూ పాదయాత్రలో తమ సమస్యను జగన్కు వివరించారు. తమ ప్రాంతంలో ఉప్పునీరు పడుతోందని, తాగునీరు అందించాలని కోరుతున్నా పంచాయతీ వారు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు