15 రోజులకోసారి రక్తం ఎక్కించాలయ్యా
తూర్పుగోదావరి : ‘‘మా బిడ్డకు తీవ్ర అనారోగ్యం దాపురించింది. ప్రతి 15 రోజులకోసారి రక్తం ఎక్కించాల్సి వస్తోందయ్యా. మీరే ఆదుకోవాలి.’’ అంటూ పాదయాత్రలో కాట్రేనుపాడు గ్రామానికి చెందిన కొల్లు మధుకిరణ్ తల్లిదండ్రులు జననేత జగన్ను వేడుకున్నారు. బిడ్డకు ఇప్పటి వరకూ చేసిన వైద్య పరీక్షలు, డాక్టర్లు చేసిన వైద్యానికి చెందిన పత్రాలను వెంట తీసుకొచ్చి జగన్కు చూపించారు.కాకినాడలోని బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం ఎక్కిస్తున్నామని, మూడు నెలకోసారి హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వస్తున్న వైద్యుడికి చూపిస్తున్నామని అన్నారు. నెలకు రూ.ఐదు వేలు ఖర్చవుతోందని జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు