చదువులో వెనుకబడుతున్నారు
తూర్పుగోదావరి : రాజోలు నియోజకవర్గంలో కాలేజీలు లేకపోవడంతో చదువులో విద్యార్థులు వెనుకబడిపోతున్నారని చింతపల్లికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు రాపాక నరేష్, గెడ్డం సురేష్, నక్కా సంజీవ్ జగన్ను పాదయాత్రలో కలిసి వివరించారు. తీరప్రాంతాల్లో 17 గ్రామాలు ఉన్నాయని వారు చదువుకునేందుకు సుమారు 20 కిలో మీటర్ల దూరం నుంచి రావాల్సి ఉందన్నారు. ఉన్నత చదువుల కోసం భీమవరం, అమలాపురం వెళ్లాల్సి వస్తోందని, కళాశాలను ఏర్పాటు చేయాలని వారు కోరారు.
సంబంధిత వార్తలు