ఆర్థిక సాయం అందించండి
కుడుపూడి దుర్గాభవాని, శ్రీరామమూర్తి, నాగుల్లంక
తమ కుమార్తె నందిని మెదడు సంబంధ వ్యాధితో బాధపడుతోందని నాగుల్లంకకు చెందిన కుడుపూడి దుర్గాభవాని, శ్రీరామమూర్తి వాపోయారు. ఆమె ఆరోగ్యం మెరుగవుతుందని చాలా ఆస్పత్రులకు తీసుకువెళ్లామని, ఇప్పటి వరకు లక్షలాది రూపాయలు ఖర్చు చేశామని, అయినా నయం కాలేదని, తన కుమార్తెను ఆదుకునేందుకు దాతలుసహకరించాలని జననేత జగన్కు వారు విన్నవించుకున్నారు.