దివ్యాంగులను ఆదుకోవాలి

people sharing their sorrows ys jagan praja sankalpa yatra - Sakshi

డి.చంద్రశేఖర్, దివ్యాంగుడు, వాడ్రేపుపల్లి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకోవాలని వాడ్రేవుపల్లికి చెందిన దివ్యాంగుడు డి.చంద్రశేఖర్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రజా సంకల్ప యాత్రలో బుధవారం ఆయన జగన్‌కు వినతి పత్రం అందజేశారు. జగన్‌ సీఎం అయిన తరువాత డిజెబిలిటీ జీఓను 40 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని, దివ్యాంగులకు పింఛను రూ.5 వేలు నుంచి 7 వేలు ఇవ్వాలని, వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని, అంత్యోదయ కార్డు ఉన్న వారికి 50 కేజీల బియ్యం ఇవ్వాలని కోరానన్నారు. జగన్‌ సీఎం అయిత తరువాత వీటిని నెరవేరుస్తారని నమ్మకం ఉందని పేర్కొన్నాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top