నాకు ఎవరూ లేరయ్యా, నువ్వే దిక్కు
– కట్టా నాగేశ్వరమ్మ
నాకు ఎవరూ లేరయ్యా.. నువ్వే దిక్కు. ఆదుకోవాలంటూ జగన్ను వేడుకుంది కట్టా నాగేశ్వరమ్మ. అందరితో బాగా మాట్లాడుతున్నారని, సమస్యలు చెప్పుకుంటే వింటున్నారని తెలిసి వచ్చానని తాటిపాక మఠానికి చెందిన నాగేశ్వరమ్మ అన్నారు. తనకు పిల్లలు లేరని రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నానన్నారు. తన చేయి విరిగిపోవడంతో రూ.పది వేలు ఖర్చయ్యిందనీ, తనకు ఆదరణ కరువైందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.