కండరాల వ్యాధితో బాడుతున్నారు.. ఆదుకో అన్నా..

people sharing their sorrows ys jagan praja sankalpa yatra - Sakshi

యల్లమిల్లి గంగాభవాని, శ్రీనివాసరావు, నక్కడిలంక, పశ్చిమగోదావరి జిల్లా 
మా పిల్లలు కండరాల వ్యాధితో బాధపడుతున్నారని ఆదుకో అన్నా అని పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం నక్కడిలంక గ్రామానికి చెందిన యల్లమిల్లి గంగాభవాని, శ్రీనివాసరావు జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నాగుల్లంకకు వచ్చిన జగన్‌ను వారు కలుసుకుని తమ పిల్లలు సత్యస్వరూప్‌ (11), కార్తీక్‌ (9)లు ఐదేళ్ల వయస్సు నుంచి కండరాల వ్యాధితో బాధపడుతున్నారని, ఎన్ని ఆస్పత్రులకు తిప్పినా బాగవలేదన్నారు. మూడు నెలలకు ఒకసారి హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వస్తోందని, కొబ్బరి దింపు కార్మికుడైన శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top