వచ్చిన రుణం వెనక్కి పోయిందంటున్నారు
చొప్పళ్ల సత్యనారాయణమ్మ
నాకు ఇంటి రుణం మంజూరైందని చెప్పడంతో పునాదుల వరకూ కట్టుకున్నాను. తీరా చూస్తే వచ్చిన రుణం వెనక్కిపోయిందంటున్నారని నాగుల్లంకకు చెందిన చొప్పళ్ల సత్యనారాయణమ్మ జగనన్నకు మొరపెట్టుకుంది. రుణం మంజూరైంది కట్టేసుకో అనడంతో రూ.లక్షా యాభైవేలు అప్పు చేసి పునాదులు పనిచేయించాను. తర్వాత రుణం ఇవ్వకపోవడంతో చేసిన అప్పులు నాలుగేళ్లుగా తీర్చుకోవడంతో సరిపోయింది. ఇల్లు కట్టుకోలేకపోయానయ్యా అంటూ జగన్కు సమస్యను చెప్పుకుంది.