నాలుగు సర్జరీలైనా పింఛను ఇవ్వలేదు..
తూర్పుగోదావరి :‘పాఠశాలకు వెళ్తుండగా లారీ ఢీకొనడంతో నా శరీరంలోని పలు భాగాలు దెబ్బతిన్నాయి. నాన్న శ్రీను ఏమీ తెలీని మనిషి. అమ్మ సుబ్బలక్ష్మి అన్నీ తానై సాకుతోంది. నాలుగు సార్లు సర్జరీ అయినా పింఛను మంజూరు చేయడంలే’దంటూ రావులపాలేనికి చెందిన బాదిన దేవకుమారి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తన బాధలను చెప్పుకొంది. ఏడాదిన్నర క్రితం సంభవించిన ప్రమాదం తమ కుటుంబాన్ని వీధిన పడేసిందని, ప్రమాద తీవ్రత కారణంగా కనీసం కింద కూర్చునే పరిస్థితి కూడా లేదని వాపోయింది. తనను ఆదుకోవాలని అభ్యర్థిస్తూ వినతిపత్రం ఇచ్చింది.
సంబంధిత వార్తలు