నీవు సీఎం అయితే పేదలకు న్యాయం
తూర్పుగోదావరి : అన్నా ముసలి వాళ్లకు పింఛన్లు రావడం లేదు, అర్హులకు రేషన్కార్డులు అందడం లేదు. మీరు సీఎం అయితేనే వారికి న్యాయం జరుగుతుందన్నా అని అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన లక్ష్మీఅరుణకుమారి జగన్కు తెలిపారు.
జగన్ వస్తేనే మహిళలకు ఆర్థిక భరోసా – మారే ఆదిలక్ష్మి కొత్తపేట
జగనన్న అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్థిక భరోసాతో పాటు న్యాయం జరుగుతుంది. మహిళలకు వచ్చే సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయడం లేదు. మండల కేంద్రాల్లో కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుపేదలకు కుట్టుమెషీన్లు పంపిణీ చేయాలని కొత్తపేటకు చెందిన మారే ఆదిలక్ష్మి కోరారు.
సంబంధిత వార్తలు