జగనన్న వస్తే మా సమస్యలు తీరినట్టే
తూర్పుగోదావరి : జగనన్న వస్తే మా సమస్యలు తీరినట్టే అని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెద్దవాడపల్లి గ్రామానికి చెందిన కప్పల సునీత తెలిపారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వెలిచేరు గ్రామానికి చేరుకున్న జగన్మోహన్రెడ్డిని సునీత తన కుటుంబ సభ్యులతో కలుసుకుంది. జగన్ను కలిసిన అనంతరం ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆయన మీద అభిమానంతో మూడు రోజులుగా పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నామని ఈ రోజు జగన్ను కలవడం ఎంతో ఆనందంగా ఉందని సునీత తెలిపింది.
సంబంధిత వార్తలు