అరటి రైతులను ఆదుకోవాలి
తూర్పుగోదావరి : గోదావరి పరీవాçహక ప్రాంతంలో అరటి తోటలు ఎక్కువగా సాగు చేస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఏటా తీవ్రనష్టాల పాలవుతున్నాం. ప్రత్యామ్నాయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అ«ధికారంలోకి వచ్చిన తర్వాత అరటి రైతులకు పంట నష్ట పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. అరటి తోటలు పడిపోకుండా వెదురు బొంగులు రూ.120 నుంచి రూ.150 వరకూ కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇందుకు అవసరమైన 50 శాతం రాయితీ కల్పించాలి. తెలుగుదేశం ప్రభుత్వం అరటి పంటలకు రుణమాఫీ కల్పించలేదు. అరటి రైతులు అరటి గెలలను విక్రయించేందుకు వాహనాలపై వెళ్తూ ప్రమాదాలకు గురై చనిపోతే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక అరటి రైతుల సమస్యలు పరిశీలించి ఆదుకోవాలని అరటి రైతులు ఊబలంక శేఖర్, కె.సత్యనారాయణ చౌదరి, డీవీ సుబ్రహ్మణ్య శర్మ, కలుగూరి కూనిరెడ్డి తదితరులు జగన్ను కలిసి విజ్ఞప్తి చేశారు.
సంబంధిత వార్తలు