నేను సైతం సైకిల్ యాత్ర
తూర్పుగోదావరి : తిరుపతికి చెందిన బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి ఎన్.గంగన్న ప్రజా సంకల్పయాత్రలో సైకిల్పై పాల్గొంటున్నాడు. తిరుపతిలో గత నెల 14న సైకిల్పై బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల దగ్గర ప్రజాసంకల్ప యాత్రను చేరుకున్నారు. ప్రత్యేక హోదా ప్రాముఖ్యాన్ని వివరిస్తూ సైకిల్ యాత్ర కొనసాగిస్తున్నానని, ప్రత్యేక హోదా ఒక్క జగన్వల్లే సాధ్యమవుతుందన్న నమ్మకంతో ఆయన నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్ర చివరి వరకు తన సైకిల్ యాత్రను కొనసాగిస్తానన్నారు. జగన్, ప్రత్యేక హోదాపై మూడు పాటలను రచించి త్వరలోనే పాడి
వినిపిస్తానని తెలిపారు.
సంబంధిత వార్తలు