ప్రభుత్వ లెక్చరర్ల మాదిరిగానే జీతాలివ్వాలి
తూర్పుగోదావరి : ఎయిడెడ్ టెంపరరీ లెక్చరర్స్ అసోసియేషన్ఎయిడెడ్ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు ప్రభుత్వ లెక్చరర్లకు ఇస్తున్న వేతనాలనే ఇవ్వాలి. రాష్ట్రంలో 179 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. దీనిలో రెండు వేల మంది లెక్చరర్లు పనిచేస్తున్నారు. పనికి తగిన వేతనాన్ని ప్రభుత్వం అందించాలని పలుమార్లు వినతిపత్రం అందజేసినా పట్టించుకోలేదు. మీరు మా సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయాలి.
నేటికీ ఇల్లు నిర్మించుకోలేదు..– గుత్తుల రమణమ్మ, ధవళేశ్వరం
నేను ఇల్లు కట్టుకోడానికి దరఖాస్తు చేసుకున్నాను. ప్రభుత్వాధికారులు ఫొటోలు కూడా తీసుకున్నారు. ఎప్పుడు వారిని అడిగినా వస్తాది అని చెప్పడం తప్ప నేటికీ అందలేదు. నా పేరున ఇంటి నిర్మాణం మంజూరైందని అధికారులు ఎనిమిది నెలలుగా చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకూ నాఇంటి నిర్మాణ పరిస్థితి ఏమిటో అర్థం కాకుండా ఉంది. మాకు న్యాయం చేసి ఇంటినిర్మాణాలను పూర్తి చేయించాలి.
సంబంధిత వార్తలు