1100 సక్రమంగా పనిచేయడం లేదు
తూర్పుగోదావరి : 1100 సక్రమంగా పని చేయడం లేదని కొ వ్వూరుకి చెందిన నూ తలపాటి అనిల్ జ గన్ని కలిసి చెప్పారు. ప్రజా సమస్యలపై ఫి ర్యాదులు చేసేందుకు ఆ నంబర్కు ఫోన్ చేసినా స్పందన ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మా భూమి లాగేసుకున్నారు
అన్నా నాకు మిలట్రీ కోటాలో ఐదెకరాలు భూ మి కేటాయించినట్టు పాస్బుక్ కూడా ఇచ్చా రు. ఆ భూమి ఎక్కడ ఉందో చూపించమని అడిగినా చూపించలేదు. ఏడాది క్రితం నాకు ఇచ్చిన భూమిని ప్రభుత్వానికి అవసరమైం దని మీ భూమికి సంబంధించిన నగదును అకౌంట్లో వేస్తామని చెప్పి అధికారులు పాస్బుక్, నా ఖాతా నంబర్ ఇమ్మని తీసుకున్నారు. ఇంతవరకూ ఎలాంటి సమాచారం లేదు. తిరగలేకపోతున్నాను అంటూ.. కొవ్వూరుకు చెందిన కడలి భాస్కరరావు జగన్ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.
చాలా ఆనందంగా ఉంది
జగనన్నను చూసేందుకు ఇక్కడికి వచ్చాం. ఆయన్ను కలిశాం. జగనన్న మమ్మల్ని దీవించడం చాలా ఆనందంగా ఉంది. ఇది మా జీవితాల్లో మరిచిపోలేని రోజు అంటూ కొవ్వూరుకు చెందిన ఎస్కే కీర్తి, నగల కరుణ తెలిపారు. మహానేత వైఎస్సార్ను పాదయాత్రలో కలుసుకోవాలనుకున్నాం. అప్పుడు అ వకాశం రాలేదు. ఇప్పుడు ఆయన కుమారుడిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
సంబంధిత వార్తలు