జగన్మోహన్రెడ్డిని చూడాలని..
పశ్చిమగోదావరి : ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న జగన్మోహన్రెడ్డిని కలుసుకుని భీమవరానికి చెందిన వొల్లిపో శాంతి రాణి, యడ్ల నాగశాంతి తదితర 20 మంది మహిళలు, పురుషులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ముఖాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు వేసుకుని జగన్మోహన్రెడ్డిని కలిశారు. జగన్తో సెల్ఫీ దిగడం ఆనందం కలిగించిందని వారు తెలిపారు.