ఎంపీటీసీగా పోటీ చేశానని..
పశ్చిమగోదావరి :‘‘అన్నా నేను మన పార్టీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేశాను. పోటీ నుంచి తప్పుకుంటే టీడీపీ నాయకులు రూ.7 లక్షలు ఇస్తామని చెప్పారు. నేను ఒప్పుకోకుండా పోటీచేసి ఓటమి పాలయ్యాను. అప్పటి నుంచి నన్ను తెలుగుదేశం నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇల్లు మంజూరులోనూ అడ్డంకులు కల్పిస్తున్నారు’’ అని వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి బుట్టయిగూడెం గ్రామానికి చెందిన కొప్పిశెట్టి గంగ భర్తతో కలిసి వచ్చి తన బాధ చెప్పుకుంది.