40శాతం వైకల్యం ఉన్నా.. పింఛను ఇవ్వన్నా..
పశ్చిమగోదావరి :ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెం గ్రామంలో వికలాంగుడు పల్లి రమేష్ వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని కలిసి 40 శాతం వైకల్యం ఉన్నా పింఛన్ మంజూరు చేయాలని కోరాడు. చాలా మంది వికలాంగులు 40 శాతం వైకల్యంతో బాధపడుతున్నారని, అయితే వారికి పింఛను అందడం లేదని వివరించాడు. ఈ మేరకు జగనన్నకు వినతిపత్రం ఇచ్చాడు.