క్యాన్సర్తో బాధపడుతున్నా..
పశ్చిమగోదావరి :అయ్యా నాకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. నాలుగు నెలల క్రితం ఆరోగ్యం సరిగా లేని నన్ను వైద్యులు పరీక్ష చేసి క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారించారు. అప్పటి నుంచి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాను. నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. నాకు నలుగురు పిల్లలు. ఉన్నారు. నాకు వైద్య సహాయంతో పాటు నా కుటుంబాన్ని ఆదుకునేలా సహాయ పడాలంటూ రాజా పంగిడిగూడానికి చెందిన గుర్రం వెంకటరావు అనే రైతు ప్రజాసంకల్ప యాత్రలో జగన్మోహన్రెడ్డిని అదే గ్రామంలో కలుసుకుని తన గోడు విన్నవించుకున్నారు.