జగనన్న వెంటే..
పశ్చిమగోదావరి :నాలుగేళ్ల క్రితం రైలు ప్రమాదంలో కాలు విరిగిపోయింది. వైఎస్ కుటుంబంపై ఉన్న ప్రేమతో జగనన్న పాదయాత్రలో పాల్గొంటున్నాను. ఈ నెల 7న గుడివాడలో జరిగిన బహిరంగ సభ నుంచి జగనన్న వెంట పాదయాత్రలో ట్రై సైకిల్పై పాల్గొంటున్నాను. ఈ రోజు జగనన్నను రాజా పంగిడిగూడెంలో కలిసి తాను గుడివాడ నుంచి యాత్రలో పాల్గొంటున్నానని తెలిపాను. చివరివరకూ జగనన్న వెంట పాదయాత్రలో పాల్గొంటాను. ఇన్ని రోజులకు జగన్ను కలిసే అవకాశం లభించింది.