108 ఉద్యోగులను రెగ్యులర్‌ చేయండి

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

పశ్చిమగోదావరి :ప్రజా సంకల్పయాత్ర పంగిడిగూడెం వద్ద 108 కాంట్రాక్ట్‌ ఉద్యోగి అయిన ఎం.రాజు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తాము వైఎస్సార్‌ వల్ల 108 విభాగంలో ఉద్యోగాలు చేస్తున్నామన్నారు. ఆయన మరణానంతరం ఏ ప్రభుత్వం మమ్ములను గుర్తించక పోగా, 108 విభాగాన్ని కూడా సక్రమంగా నిర్వహించడం లేదని జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. తమకు సరైన వేతనాలు ఇవ్వడం లేదని, కుటుంబ పోషణ భారం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల నుంచి గ్రాట్యుటీ, పీఎఫ్‌ ఇవ్వడం లేదని వాపోయారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 108 ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని కోరారు. 

నా భర్తకు పక్షవాతం :  శెట్టి కుమారి
పశ్చిమగోదావరి :నా భర్తకు పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయింది. దీంతో నేను కూలికివెళితేనే మా పొట్ట నిండుతుంది. మూలన పడిన నా భర్తకు పింఛన్‌ ఇవ్వాలనిఅనేక సార్లు అర్జీలు పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో పూట గడిచీ, గడవకుండా నెట్టుకొస్తున్నాం. మా గ్రామంలో డబ్బున్న వారు చాలామందికి పెన్షన్‌ వచ్చాయి గానీ మాకు మాత్రం ఇవ్వడం లేదని పంగిడి గూడానికి చెందిన శెట్టి కుమారి జగన్‌మోహన్‌రెడ్డికి విలపిస్తూ చెప్పింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top