వ్యవసాయంలో నష్టంతో నా భర్త ఆత్మహత్య

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

పశ్చిమగోదావరి :కామవరపుకోట మండలం ఈస్ట్‌ యడవల్లి గ్రామానికి చెందిన ఆకుల హేమలత ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం వద్ద వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తన ఆవేదన వెళ్లగక్కింది. తన భర్త ఆకుల సత్యనారాయణ రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని దొండపాదులు పెట్టి బోరుసాయంతో వ్యవసాయం చేశాడన్నారు. కాగా విద్యుత్‌ ఇబ్బందులతో సాగు నీరు సరిగా అందక దిగుబడి తగ్గిందని, దీనికి తగ్గట్టుగా ధర కూడా సరిగా లేకపోవడంతో రూ.5 లక్షల వరకు అప్పుల పాలయ్యామన్నారు. దీంతో పొలంలోనే తన భర్త ఉరివేసుకుని చనిపోయాడని తెలిపింది. కూలీ చేసి ఇద్దరి పిల్లలను పోషించుకుంటున్నానని, తన లాంటి రైతు కుటుంబాలను ఆదుకోవాలని ఆమె వేడుకుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top