నా భర్తను అన్యాయంగా చితక్కొట్టారు
పశ్చిమగోదావరి :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నామనే కారణంగా పంగిడిగూడెం గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు 20 రోజుల క్రితం నా భర్త కుమార్బాబును అన్యాయంగా చితక్కొట్టారని ఈపూరు భవాని పంగిడిగూడెం వద్ద జగన్మోహన్రెడ్డిని కలిసి తన గోడు చెప్పింది. ఏలూరు ఆసుపత్రిలో తన భర్త తలకు 12 కుట్లు వేసి ఐదు రోజులు ఆసుపత్రిలో ఉంచారని వాపోయింది. మాదిగ కులానికి చెందిన తన భర్తపై దాడిచేసినా పోలీసులు ఇంత వరకు కేసు నమోదు చేయలేదని వాపోయింది. తెలుగుదేశం గూండాల నుంచి తన భర్తకు, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె కోరింది.